జగన్ బెయిల్ పై మంచు లక్ష్మీ కామెంట్
posted on Sep 23, 2013 6:35PM
వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ మంజూరు కావడంపై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు, నటి, నిర్మాత మంచు లక్ష్మి తనదైన రీతిలో స్పందించారు. జగన్ కు బెయిల్ రావడాన్ని ఆమె గొప్ప విజయంగా పేర్కొన్నారు. వైఎస్ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.
వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నాంపల్లి సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ కొన్ని షరతులు విధించింది. రెండు లక్షల రూపాయల సెక్యూరిటీ బాండ్ ను, ఇద్దరు పూచీకత్తును ఇవ్వలని కోరింది. అలాగే హైదరాబాద్ విడిచి వెళ్లకూడదని, షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరించింది.
అలాగే కేసు విచారణలో సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నం చేయరాదని కోర్ట్ ఆదేశించింది. జగన్ కు బెయిల్ రావడంతో ఇక పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, అలాగే ఆడిటర్ విజయసాయి రెడ్డిలకు కూడా బెయిల్ రావడానికి మార్గం సుగమమం అయినట్లు భావించవచ్చు.