ఐపీఎల్‌లో పెందెంగా భార్య...ఓడిపోయాడు..!

ప్రజంట్ దేశం మొత్తం ఐపీఎల్ ఫీవర్‌లో ఊగిపోతోంది..అందరూ మ్యాచ్‌లను చూస్తూ ఎంజాయ్ చేస్తుండగా, అదే స్థాయిలో బెట్టింగ్ కూడా జోరుగా సాగుతోంది. బెట్టింగ్ కోసం డబ్బు, నగలు, భూములు పందెంగా కాయడం మనం చూస్తుంటాం. అయితే ఒక ప్రబుద్ధుడు మహాభారతం నుంచి స్పూర్తి పోందాడో ఏమో ధర్మరాజు జూదంలో ద్రౌపదిని పందెంగా కాసినట్టు, ఇతడు కూడా తన భార్యను పందెంగా కాసాడు. చివరికి బెట్టింగ్‌లో భార్యను ఓడిపోయాడు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లా గోవింద్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఐపీఎల్‌లో బెట్టింగ్ కాయడం అలవాటు. ఈ నేపథ్యంలో చేతిలో డబ్బులు లేకపోవడంతో భార్యను పెట్టి పందెం కాశాడు. అతను ఎంచుకున్న జట్టు ఓడిపోవడంతో భార్యను కోల్పోయాడు. పందెం గెలిచిన జూదరులు ఇంటికి రావడం, ఫోన్ చేసి అతని భార్యను వేధించడం మొదలుపెట్టారు. దీంతో విసిగిపోయిన బాధితురాలు సామాజిక కార్యకర్తల సాయంతో పోలీసులను ఆశ్రయించింది.