ఆస్తికోసం తమ్ముణ్ణే చంపేశాడు...

 

డబ్బు ఎంత దుర్మార్గాన్నయినా చేయిస్తుంది. ఆస్తి ఏ అనుబంధాన్నయినా తెంచుకోవడానికి పురిగొల్పుతుంది. అలాంటి పాపిష్టి డబ్బు, ఆస్తి ఒక వ్యక్తిని రక్తసంబంధాన్నే మరచిపోయి రక్తాన్ని చిందించాడు. సొంత తమ్ముడి ప్రాణాన్నే హరించాడు. కాన్పూర్ సమీపంలోని బిల్హౌర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. వినీత్ కుమార్ (40) అనే వ్యక్తికి, అతడి తమ్ముడు సునీల్కు ఆస్తి విషయంలో ఆదివారం నాడు గొడవ జరిగింది. దాంతో తర్వాత కొద్ది సేపటికి బాగా తాగి ఉన్న సునీల్ను వినీత్ గట్టిగా తోసి, తలను గోడకేసి కొట్టాడు. దాంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. సోదరులిద్దరికి కలిపి దాదాపు మూడు కోట్ల రూపాయల ఆస్తి ఉంది. దాన్ని ఇప్పటికే పంపకాలు కూడా జరిగాయి. అయితే తాగుబోతు అయిన సునీల్ ఆస్తిని కూడా తానే కాజేయాలని వినీత్ పథకాలు వేసేవాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. చివరికి సునీల్ ప్రాణాలు పోయాయి. తమ్ముణ్ణి చంపిన వినీత్ మృతదేహాన్ని తన స్నేహితుల సాయంతో ఒక కాలువలో విసిరేసి వచ్చాడు. అయితే పోలీసులు జరిపిన విచారణలో వినీత్ దోషి అని తేలింది.