టీడీపీ ఎంపీకి బెదిరింపు ఫోన్లు

 

తాజా ఎన్నికలలో మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన విద్యావేత్త, మల్లారెడ్డి గ్రూపు విద్యా సంస్థల అధినేత మల్లారెడ్డికి గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. మావోయిస్టుల పేరుతో ఫోన్ చేసిన ఆ వ్యక్తి 30 కోట్లు విరాళం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అలా ఇవ్వకపోతే మీ విద్యాసంస్థలని బాంబులతో పేల్చివేస్తామని హెచ్చరించాడు. దాంతో మల్లారెడ్డి బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 506 కింద కేసు నమోదు నమోదు చేశారు. ఎంపీ సెల్‌ఫోన్‌కు వచ్చిన కాయిన్ బాక్స్ ఫోన్ నంబర్‌పై నగర పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మల్లారెడ్డి ఎంపీగా గెలుపొందిన రోజు నుంచి ప్రతి నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి తాను నక్సలైట్‌నని, తమ పార్టీకి రూ. 30 కోట్లు విరాళంగా ఇవ్వాలని, లేని పక్షంలో నీ అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.