హంసవాహనంపై మలయప్పస్వామి
Published on: Fri Sep 26, 2025 10:27AM

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన గురువారం (సెప్టెంబర్ 25) రాత్రి మలయప్ప స్వామి హంసవాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా వాహనసేవలో వివిధ కళాబృందాల ప్రదర్శనలు అలరించాయి.
బ్రహ్మోత్సవాలలో మూడో రోజైన శుక్రవారం (సెప్టెంబర్ 26) ఉదయం సింహవాహనంపై శ్రీవారు మాడవీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. ఇక రాత్రి ఏడు గంటలకు ముత్యపు ప ందిరి వాహన సేవ ఉంటుంది.


