మహారాష్ట్ర... బీజేపీకే ప్రీపోల్ పట్టం

 

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పట్టంకట్టేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని ప్రీ పోల్ సర్వేల్లో తేలింది. అయితే, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మాత్రం శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే వుండాలని మహారాష్ట్ర ఓటర్లు భావిస్తున్నారు. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఈ నెల 15వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో పంచముఖ పోటీ నెలకొనివుంది. ఈ ఎన్నికలలో చిన్న పార్టీలతో కలిసి పోటీ చేస్తున్న బీజేపీ 154 స్థానాలు పొందుతుందని, 47 సీట్లతో శివసేన రెండో స్థానంలో ఉంటుందని ది వీక్, హన్సా రీసెర్చ్ సర్వేలో వెల్లడైంది. బీజేపీకి 133 స్థానాలు వస్తాయని ప్రీపోల్ సర్వే చెప్పింది. ఇండియా టుడే నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో కూడా ఈ తరహా ఫలితమే వచ్చింది.