పోలీసు ఉద్యోగ పరుగులో ఐదుగురి మృతి

 

 

 

పోలీసు ఉద్యోగాల కోసం నిర్వహించే పరుగు పందెం సందర్భంగా అనేకమంది యువకులు ప్రాణాలు కోల్పోతూ వుండటం బాధాకరమైన విషయం. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు పరుగు పందెం సందర్భంగా ఎంతోమంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా బుధవారం నాడు మహారాష్ట్రలో జరిగిన పోలీసు ఉద్యోగాల పరుగు పందెంలో ఐదుగురు యువకులు మరణించడం సంచలనం సృష్టించింది. ముంబైలో జరిగిన పరుగు పందెంలో నలుగురు యువకులు మరణించగా, థానెలో జరిగిన పరుగుపందెంలో ఒకరు మరణించారు. ఈ ఐదుగురూ పరుగు పందంలో పాల్గొంటూ స్పృహ తప్పి పడిపోయి, ఆ తర్వాత ఆస్పత్రుల్లో మరణించారు. పోలీసు రిక్రూట్‌మెంట్‌లో భాగంగా 5 కిలోమీటర్ల పరుగు పందెం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందు జాగ్రత్త చర్యగా పరుగుపందె జరిగే ప్రదేశంలో చాలామంది డాక్టర్లను కూడా వుంచారు. అయినా మరణాలు సంభవించాయి.