బీజేపీ నేత వద్ద 91 లక్షలు స్వాదీనం....

 

కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో సామాన్య ప్రజలకు ఎలాంటి నష్టం లేకున్నా..నల్ల కుబేరులు మాత్రం సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ మంత్రిగారు చిక్కుల్లో పడ్డారు. అది కూడా ఏ పార్టీ అయితే కేంద్రంలో అధికారంలో ఉందో.. అది కూడా నోట్లు రద్దు చేసిన పార్టీ బీజేపీయే కావడం ఆశ్చర్యకరం. బీజేపీ పార్టీకి చెందిన సుభాష్‌ దేశ్‌ముఖ్‌ నుంచి 91 లక్షలా 50 వేల రూపాయల విలువైన 500, 1000 రూపాయల నోట్లను మహారాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోలాపూర్‌లో మంత్రికి చెందిన ఎన్జీవో వాహనంలో డబ్బును తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. డబ్బుతో పాటు వాహనాన్ని సీజ్‌ చేసినట్టు పోలీసులు తెలిపారు. అంతేకాదు ఈ డబ్బును జిల్లా ట్రెజరీలో డిపాజిట్‌ చేసినట్టు తెలిపారు. వ్యాపార లావాదేవీల్లో భాగంగా ఈ డబ్బు తన వద్ద ఉంచుకున్నట్టు ఆయన పోలీసులకు తెలిపారు. ఇక దీనిపై స్పందించిన ప్రతి పక్ష నేతలు మంత్రి పదవి నుంచి దేశ్‌ముఖ్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.