ముంబైలో కుంభవృష్టి

దేశ ఆర్థిక రాజధాని ముంబై తడిసి ముద్దవుతోంది. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు మహా నగరాన్ని ముంచెత్తుతున్నాయి. గుజరాత్ సమీపంలో అరేబియా సముద్రంలో ఏర్పడిన ద్రోణి కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని కొలాబా, శాంతాక్రజ్ ప్రాంతాల్లో 26.8 మి.మీల నుంచి 50 మి.మీల వర్షపాతం నమోదయ్యిందని పేర్కొన్నారు. వర్షాల కారణంగా ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించింది. లోకల్ రైళ్లను నడపటానికి ఇబ్బందులు ఏర్పడినప్పటికి సాధారణ సమయానికే రైళ్లు నడిపేందుకు రైల్వేశాఖ ప్రయత్నిస్తోంది. ముంబయితో పాటు కొంకణ్ తీరం, గోవాల్లో కూడా వచ్చే రెండు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మత్య్సకారులు చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరించింది.