పట్టాలు తప్పిన రైలు.. 10 మంది పరిస్థితి విషమం


ఢిల్లీలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ నుంచి దిల్లీ వెళ్తున్న మహాకోశల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహోబా-కుల్పహర్‌ రైల్వేస్టేషన్‌ల మధ్య పట్టాలు తప్పింది. మొత్తం 6 బోగీలు పట్టాలు తప్పగా. మూడు ఏసీ, మూడు జనరల్‌ బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 36 మంది ప్రయాణికులు గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయచర్యలు చేపట్టారు. ఇక దీనిపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్పందించి విచారం వ్యక్తం చేశారు.