ప్యూను ఆస్తి.. జస్ట్ ఏడు కోట్లు..

 

మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ నగరంలో కుల్దీప్ యాదవ్ అనే ఓ సహకార బ్యాంకులో పనిచేసే ప్యూను ఏకంగా దాదాపు ఏడుకోట్ల రూపాయల ఆస్తులు కూడగట్టాడు. ఆయన గారి ఆస్తిలో ఆరు భారీ భవంతులు, రెండు లగ్జరీ కార్లు ఒక భాగం. గ్వాలియర్లోని అతడి ఇళ్లపై లోకాయుక్త, ఏసీబీ పోలీసులు సోదాలు జరిపారు. ఈ సోదాల్లో ఇప్పటి వరకు ఏడు కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయి. అతని ఆస్తులకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయని, అప్పుడు కళ్ళు తిరిగేంత మరింత సంపద బయటపడే అవకాశం వుందని అధికారులు చెబుతున్నారు. యాదవ్ ఆస్తి గురించి వ్యక్తి ఫిర్యాదు రావడంతో ఈ సోదాలు చేశారు.