లంచ్ మోషన్ పిటిషన్.. కేటీఆర్ కు ఊరట.. చుక్కెదురు!
Published on: Wed Jan 8, 2025 4:12PM

ఫార్ములా-ఈ కార్ కేసులో ఏసీబీ విచారణకు తన వెంట న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన కేటీఆర్ కు ఒకే సమయంలో మోదం; ఖేదం కలిగేలా కోర్టు తీర్పు వెలువరించింది. కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ ను విచారించిన తెలంగాణ హైకోర్టు కొద్ది సేపటి కిందట తీర్పు వెలువరించింది.
ఏసీబీ విచారణకు తన వెంట లాయర్ ను తీసుకువెళ్లే వెసులుబాటు ఇచ్చిన న్యాయస్థానం అదే సమయంలో విచారణ గది బయటి వరకూ మాత్రమే న్యాయవాదికి అనుమతి ఇచ్చింది. ఏసీబీ నోటీసుల నేపథ్యంలో కేటీఆర్ గురువారం ఏసీబీ ఎదుట విచారణకు హాజరు కానున్న సంగతి తెలిసిందే.


