బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి మళ్లీ వానగండం!
Published on: Mon Sep 23, 2024 11:17AM
.webp)
నిన్న మొన్నటి వరకూ భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్ కు మరో సారి భారీ వర్షాల ప్రమాదం పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంకారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. సోమవారం (సెప్టెంబర్ 23) నుంచి బుధవారం (సెప్టెంబర్ 25) వరకూ ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


