లాటరీ గెలవండి.. స్వాగతం పలకండి..

 

త్వరలో అమెరికా పర్యటనకు వెళ్ళనున్న భారత ప్రధాని నరేంద్రమోడీకి అమెరికాలో స్వాగతం చెప్పాలంటే లాటరీ గెలవాల్సిందే. ఈ నెల 28న అమెరికాలోని న్యూయార్క్ నగరం, మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో మోడీ కోసం ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో పాల్గొని ఆయన్ని ఆహ్వానించే వారిని లాటరీ ద్వారా ఎంపిక చేయనున్నారు. దీనికి అమెరికాలో భారీస్పందన లభిస్తోంది. దీనికోసం 20 వేల దరఖాస్తులు వచ్చిపడ్డాయి. మంగళవారం నుంచి ఈ నెల 7 వరకు సాధారణ ప్రజానీకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ ఫౌండేషన్ అవకాశం కల్పించింది. మొత్తమ్మీద దీనికోసం లక్ష వరకూ దరఖాస్తులు వచ్చే అవకాశం వుందని తెలుస్తోంది.