200మంది భారతీయుల అరెస్టు!

 

లండన్ లో దాదాపు 200 మంది భారతీయుల్ని అరెస్ట్ చేశారు. వీసా గడువు ముగిసినా లండన్‌లో ఉన్న భారతీయుల్ని అరెస్టు చేసినట్లు ఆ దేశ హోంమంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. భారత్‌ నుంచి ఏటా సుమారు వెయ్యి మంది ఎలాంటి వీసా లేకుండా లండన్‌లో ప్రవేశిస్తున్నారని.. ఈ ఏడాది జనవరి-జూన్‌ మధ్య వీసా గడుపు పూర్తి అయినా తిరిగి స్వదేశానికి వెళ్లకుండా అక్కడే కొనసాగుతన్న సుమారు 200మంది భారతీయుల్ని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. భారత్‌తో పాటు పాకిస్థాన్‌, అప్గనిస్థాన్‌, చైనా, ఆల్బానియా చెందిన పలువుర్ని అదుపులోకి తీసుకున్నట్లు వారు చెప్పారు. గడువు ముగిసినా ఇక్కడే ఉండి డబ్బులు సంపాదించుకుని.. ట్యాక్స్‌ కట్టడంలేదని వారు తెలిపారు.