తాజా సర్వే.. ఏపీలో టీడీపీదే అధికారం

 

ఎన్నికల నేపథ్యంలో సర్వేల హడావుడి మొదలైంది. ఇప్పటికే పలు సర్వేలు ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పగా.. తాజాగా ఓ సర్వే మాత్రం టీడీపీకి అనుకూలంగా వచ్చింది. ఏపీలో మళ్లీ టీడీపీదే అధికారమని ‘లోక్‌నీతి-సీఎస్ డీఎస్‌’ సర్వే స్పష్టం చేసింది. ఏబీపీ ఛానల్ కోసం ఈ సర్వే చేసినట్లు తెలిసింది. ఏపీలో టీడీపీ 46.2 శాతం ఓట్లతో 126 నుంచి 135 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుందని, వైసీపీ 37.2 శాతం ఓట్లతో 45 నుంచి 50 స్థానాలకు పరిమితమవుతుందని ఈ సర్వే తేల్చింది. జనసేన 9.6 శాతం ఓట్లతో  2 నుంచి 5 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించవచ్చునని అంచనా వేసింది. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఏపీలో ఖాతా తెరిచే అవకాశం లేదని తేల్చింది. అయితే కాంగ్రెస్ 4.8 శాతం ఓట్లతో ఏపీలో కాస్త పుంజుకునే అవకాశముందని తెలిపింది. ఇక.. 25 ఎంపీ సీట్లలో టీడీపీ 18 నుంచి 22 వరకు గెలుచుకుంటుందని, వైసీపీ 3 నుంచి 5 వరకు గెలుచుకుంటుందని స్పష్టం చేసింది.