TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

డ్రోన్ దాడులను సైతం లెక్క చేయకుండా సాగిన లోకేష్ రష్యా పర్యటన

Published on: Sun Jun 7, 2026 11:00AM

రష్యా వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆర్థిక సదస్సు   ప్రారంభానికి ముందే అక్కడ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సెయింట్ పీటర్స్‌బర్గ్ సమీపంలో ఉక్రెయిన్ డ్రోన్ల దాడికి పాల్పడటంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా సెక్యూరిటీ అలర్ట్ ప్రకటించారు. ఈ ఆకస్మిక పరిణామాలతో సదస్సుకు హాజరవుతున్న వివిధ దేశాల ప్రతినిధులలో తీవ్ర ఆందోళన, అనిశ్చితి వ్యక్తమయ్యాయి. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తన రష్యా పర్యటనను యథావిధిగా కొనసాగించాలని  సాహసోపేత  నిర్ణయం తీసుకున్నారు. డ్రోన్ల దాడుల వార్త వెలువడే సమయానికి ఆయన మాస్కో నుండి సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు ప్రయాణిస్తున్నారు. అక్కడ నెలకొన్న భద్రతా ఏర్పాట్లు, తాజా పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్షించిన అనంతరం, లోకేష్ తన షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు చేయకూడదని నిశ్చయించుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి  పెట్టుబడుల  ఆకర్షణే లక్ష్యంగా లోకేష్ పర్యటన సాగుతోంది. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా భావించిన ఏపీ ప్రతినిధి బృందం, ఎలాంటి అడ్డంకులు ఎదురైనా ముందస్తు ప్రణాళిక ప్రకారమే ముందుకు సాగాలని నిర్ణయించింది. అనుకున్నట్లుగానే మంత్రి లోకేష్ ఆర్థిక సదస్సులో పాల్గొని, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అపారమైన వ్యాపార అవకాశాలను అంతర్జాతీయ వేదికపై సమర్థవంతంగా ప్రదర్శించారు.

అసాధారణమైన భద్రతా వలయం మధ్య జరిగిన ఈ సదస్సులో మంత్రి లోకేష్ పలువురు ప్రముఖ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, బహుళజాతి కంపెనీల ప్రతినిధులతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనుకూల వాతావరణాన్ని   వివరించారు. డ్రోన్ దాడుల వార్తలు అంతర్జాతీయంగా హెడ్‌లైన్స్‌లో నిలిచినప్పటికీ, లోకేష్ పర్యటనను కొనసాగించడం ఇప్పుడు రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, పారిశ్రామిక రంగాల విస్తరణపై ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ఈ నిర్ణయం అద్దం పడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా అంతర్జాతీయ పెట్టుబడిదారుల ముంగిటకు వెళ్లి అవకాశాలను రాబట్టాలనే పట్టుదలను లోకేష్ ప్రదర్శిం చారంటున్నారు.  ఈ పర్యటన ద్వారా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌కు భారీగా విదేశీ పెట్టు బడులు తరలివచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలుచెబుతున్నాయి. ముఖ్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, తయారీ రంగాలలో కొత్త భాగస్వామ్యాలు ఏర్పడేందుకు ఈ రష్యా పర్యటన ఎంతగానో దోహదపడుతుందని పారిశ్రామిక రంగానికి చెందిన నిపుణులు అంచనా వేస్తున్నారు.