నేటి నుంచి లోక్‌సభ

 

బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం నుంచి లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 23 నుంచి రాజ్యసభ సమావేశాలు కూడా ప్రారంభమవుతాయి. భూసేకరణకు సంబధించిన ఆర్డినెన్స్‌ను సోమవారం నాడే లోక్‌సభలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశాలు వాడిగా, వేడిగా జరుగుతాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఆమధ్య జరిగిన సమావేశాలకు హాజరు కాకుండా లీవ్ తీసుకుని ఎటో వెళ్ళిపోయిన రాహుల్ గాంధీ ఈ సమావేశాలకు హాజరు అవుతున్నారు. ఆయన తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఈ సమావేశాల్లో హడావిడి చేసే అవకాశం వుందని అనుకుంటున్నారు. ఈ సమావేశంలో పలు బిల్లులను ఆమోదిస్తారు. మే 13 తేదీతో లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు పూర్తవుతాయి.