పాకిస్థాన్లో లాక్డౌన్!
Published on: Tue Apr 7, 2026 4:33PM
.webp)
తీవ్ర ఆర్థిక సంక్షోభం, అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో ఏర్పడిన ఇంధన కొరత నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ‘స్మార్ట్ లాక్డౌన్’ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ నిర్ణయం ప్రకారం ఇవాళ్టి నుంచి షాపింగ్ మాల్స్ రాత్రి 8 గంటలకే మూసివేయాల్సి ఉంటుంది. బేకరీలు, రెస్టారెంట్లు, దాబాలు, ఫంక్షన్ హాళ్లు రాత్రి 10 గంటలలోపు కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
ఈ పరిమితులు పంజాబ్, ఖైబర్ పఖ్తున్ఖ్వా, బలూచిస్తాన్, ఇస్లామాబాద్, గిల్గిత్-బాల్టిస్తాన్, పీవోకే ప్రాంతాల్లో అమలులో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో, పెరుగుతున్న ఖర్చులను నియంత్రించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.


