దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్డౌన్
posted on May 30, 2020 7:00PM
కరోనా కేసులు పెరుగుతుండటంతో.. దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్డౌన్ను పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ మరింత కఠినతరం చేస్తామని ప్రకటించింది. అత్యవసర సేవలకే మాత్రమే అనుమతి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల మరిన్ని సడలింపులు ఇచ్చింది. రాత్రివేళ కర్ఫ్యూను కుదించింది. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకే కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపింది. జూన్ 8 నుంచి ప్రార్థనామందిరాలు, హోటళ్లు, మాల్స్ ప్రారంభించుకోవచ్చని తెలిపింది. రాష్ట్రాలతో చర్చించిన తర్వాతే స్కూళ్లు, కాలేజీల పై నిర్ణయం తీసుకుంటామని కేంద్రం తెలిపింది.