దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్‌డౌన్‌

కరోనా కేసులు పెరుగుతుండటంతో.. దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్‌ మరింత కఠినతరం చేస్తామని ప్రకటించింది. అత్యవసర సేవలకే మాత్రమే అనుమతి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకే కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపింది. జూన్‌ 8 నుంచి ప్రార్థనామందిరాలు, హోటళ్లు, మాల్స్‌ ప్రారంభించుకోవచ్చని తెలిపింది. రాష్ట్రాలతో చర్చించిన తర్వాతే స్కూళ్లు, కాలేజీల పై నిర్ణయం తీసుకుంటామని కేంద్రం తెలిపింది.