TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కడియంలో చిరుత కలకలం!

Published on: Wed Sep 25, 2024 12:50PM

అడవుల్లో సంచరించాల్సిన వన్యప్రాణులు జనావాసాలలో సంచరిస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. తాజాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కడియంలో చిరుత సంచారం కలకలం రేపింది. నర్సరీలకు పేరుగాంచిన కడియంలో చిరుత సంచారం కారణంగా బుధవారం నర్సరీలను మూసివేశారు. రాజమండ్రి దివాన్ చెరువు సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి చిరుత కడియం చేరుకుందని అంటున్నారు.  కడియపు లంక దోసాలమ్మ కాలనీలో  నిన్న రాత్రి చిరుత సంచారాన్ని గుర్తించారు.