ఊళ్లోకి వచ్చిన చిరుత..పొలాల్లోకి జనం పరుగులు..

అడవిలో తిరగాల్సిన చిరుత..ఊళ్లోకి వస్తే ఎలా ఉంటుంది. ఇంకేమైనా ఉందా జనం గుండెలు ఆగిపోవు. అచ్చం ఇలాంటి పరిస్థితే ఎదురైంది ఉత్తరప్రదేశ్‌లోని ఒక గ్రామ ప్రజలకు. ఖజూరి పాండ్యా అనే గ్రామంలోకి ఉన్నట్లుండి ఒక చిరుత ప్రవేశించింది. చిరుతను చూసిన ఒక గ్రామస్తుడు ఈ విషయం మిగిలిన వారికి చెప్పేలోపే కొంతమందిపై అది దాడి చేసింది. చిరుత దాడిలో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. చిరుతను చంపేందుకు జనం చేతికి దొరికినదాంతో దాని వెనుక బడ్డారు. కానీ అది వీధుల్లో పరిగెత్తి జనాన్ని మూడు చెరువుల నీళ్లు తాగించింది. నాలుగు గంటల పాటు ముచ్చెమటలు పట్టించిన చిరుత చివరకు అడవిలోకి పారిపోయింది.