రాయదుర్గంలో చిరుత జంట..పరుగులు పెట్టిన ప్రజలు

అనంతపురం జిల్లా రాయదుర్గంలో చిరుత జంట కలకలం సృష్టించింది. పట్టణంలోని ఈ-సేవా కేంద్రం వద్ద రెండు చిరుతపులులు సంచరించాయి. అయితే ఓ చిరుత ఉదయమే వెళ్లిపోగా..మరో చిరుతను ప్రజలు, అధికారులు దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించి బంధించారు. అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో ఉదయం వెళ్లిపోయిన చిరుత మళ్లీ రాత్రి 11 గంటల సమయంలో ప్రత్యక్షం కావడంతో జనం బిక్కుబిక్కుమంటూ గడిపారు. దీంతో యువకులు, అటవీశాఖాధికారులు, పోలీసులు పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతానికి వచ్చి మాటు వేశారు. ఎట్టకేలకు ఇవాళ ఉదయం రెండో చిరుతను బంధించారు.