ఏటీయంకు ఎమ్మెల్యే పూజ...

 

పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయంపై ఇప్పటి వరకూ ఎంతో మంది నేతలు విమర్శలు గుప్పించారు. ఇక పార్లమెంట్ సంగతైతే చెప్పనక్కర్లేదు. శీతాకాల సమావేశాలు ప్రారంభమైన దగ్గరనుండి ఉభయసభల్లో రోజూ అదే సీన్. ఇంకొంత మంది తనకు నచ్చిన రీతిలో నిరసనను తెలిపారు. ఇప్పుడు తాజాగా ఓ మాజీ ఎమ్మెల్యే తన నిరసనను తెలిపారు. వివరాల ప్రకారం... ఎల్బీనగర్‌ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పెద్ద నోట్ల రద్దుపై స్పందిస్తూ..ఇన్నేళ్లలో ఎవరూ చేయని పని తాము చేశామని చెప్పుకోవడానికే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లోని కొత్తపేటలో ఆంధ్రాబ్యాంకు ఏటీఎంకు ఆయన పూజలు చేశారు. ప్రజలకు సరిపడా చిల్లర నోట్లు అందుబాటులో ఉంచకుండా పెద్దనోట్లను రద్దు చేయడం వల్ల ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు కూడా వెనుకాడాల్సి వస్తోందని.. క్షేత్రస్థాయిలో ఇబ్బందులను సమీక్షించకుండా నిర్ణయం తీసుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.