ఉస్మానియా విద్యార్థులపై లాఠీఛార్జ్: ఖండన

 

తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయడానికి వ్యతిరేకంగా ఉద్యమించిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జిని కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎంపీలు మధుయాష్కీ, వివేక్‌, రాజయ్య, పొన్నం ప్రభాకర్ ఖండించారు. విద్యార్ధుల చేస్తున్నది న్యాయమైన పోరాటమని సమర్థించారు. ఇంటికో ఉద్యోగమన్న హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న నిజాన్ని టీఆర్ఎస్ నాయకులు మర్చిపోరాదని అన్నారు. తమకు ఉద్యోగాలు రావన్న విద్యార్ధుల ఆందోళనపై టీఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.