లాలూ, శర్మలపై అనర్హత వేటు

 

Lalu Prasad disqualification, Lalu Prasad, Jagdish Sharma, Fodder scam, Lok Sabha

 

 

పశువుల దాణా కుంభకోణంలో దోషిగా నిర్దారింపబడి.. రాంచీ జైలులో ఊచలు లెక్కబెడుతున్నపార్లమెంటు సభ్యుడు లాలూ ప్రసాద్ యాదవ్ పై వేటు పడింది. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో లోకసభలో లాలుపై మంగళవారం అనర్హత వేటు పడింది. లాలూతో పాటు జెడి(యు) పార్లమెంటు సభ్యుడు జగదీష్ మిశ్రా పైన కూడా వేటు పడింది.సోమవారం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రషీద్ మసూద్ పైన వేటు పడింది. కోర్టు తీర్పు ప్రకారం మొదటిసారి వేటు పడ్డ ప్రజా ప్రతినిధులు వీళ్లే. లాలూ తన అనైతిక, అవినీతి చర్యలతో ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసి ప్రజల విశ్వాసం కోల్పోయాడు.