లాలూ కూతురికి ఊరట.. బెయిల్ మంజూరు

 

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి, ఆమె భర్త శైలేష్ కుమార్ కు కొంచెం ఊరట లభించింది. మనీలాండరింగ్ కేసులో వీరికి ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు నేడు బెయిల్ మంజూరు చేసింది. అయితే కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్ల రాదన్న షరతు విధించింది. కాగా మనీలాండరింగ్ కేసులో ఈడీ గత డిసెంబర్ 23న కోర్టులో మీసా భారతి, శైలేష్ కుమార్ కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసింది. షెల్ సంస్థల ద్వారా ఈ దంపతులు 1.2 కోట్ల మేర అక్రమంగా నగదు చలామణికి కుట్ర పన్నినట్టు ఈడీ ఆరోపణ.