'లక్మీస్‌ ఎన్టీఆర్‌' పాట బాధ కలిగించింది

 

సినీ నటుడు,ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన తండ్రి,దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ జీవితంపై తీసిన బయోపిక్ మొదటి భాగం 'ఎన్టీఆర్‌ కథానాయకుడు' ఈ రోజు రిలీజ్ అయింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంపై పలువురు రాజకీయ,సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా లక్ష్మీపార్వతి కూడా స్పందించారు. వ్యక్తిగతంగా బాలకృష్ణ చాలా మంచి వ్యక్తే.. కానీ ఏపీ సీఎం చంద్రబాబుకు బాలకృష్ణ భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌ జీవితంపై బాలకృష్ణ ఎన్ని భాగాలు తీసినా.. అది సగభాగమే అవుతుందని లక్ష్మీపార్వతి అన్నారు. రామ్‌గోపాల్‌వర్మ తీసే చిత్రంతోనే ఎన్టీఆర్‌ జీవితం పూర్తవుతుందని చెప్పారు. అంతేకాకుండా ఇటీవల వర్మ విడుదల చేసిన లక్మీస్‌ ఎన్టీఆర్‌ లోని రెండో పాటపై కూడా ఆమె స్పందించారు. 'లక్మీస్‌ ఎన్టీఆర్‌ లోని రెండో పాట ఎంతో బాధ కలిగించింది. రామ్‌గోపాల్‌వర్మ మనసులో ఏముందో తెలియదు' అని అన్నారు. ఎన్టీఆర్ జీవితంలో నిజాలను రామ్‌గోపాల్‌వర్మ తెరపై చూపిస్తారని భావిస్తున్నానని లక్ష్మీపార్వతి అన్నారు. ఎన్టీఆర్ కుటుంబంతో తనకు ఎలాంటి విభేదాలూ లేవని చెప్పారు. కథానాయకుడు సినిమా చూసేందుకు నన్నెవరూ ఆహ్వానించలేదని చెప్పుకొచ్చారు.