TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఈ అమ్మమ్మకు శుభాకాంక్షలేవి...లోకేష్‌కి లక్ష్మీ పార్వతి ప్రశ్న...అసలు మతలబు ఏంటి?

Published on: Mon Apr 20, 2026 8:23PM

 

లోకేష్ పొరబాటున ఒక తల్లిగా భావించి విజయమ్మ పుట్టిన రోజుకు ఒక ట్వీట్ పెట్టిన పాపానికి అది అటు దిరిగి ఇటు దిరిగి ఎన్నో వివాదాలకు కారణమైంది. కొందరు ఏమన్నారంటే, లోకేష్,, నానమ్మ అమ్మణ్ణమ్మ, తాతయ్య ఖర్జూర నాయుడుకి కూడా ఇలాగే విషెస్ పెట్టాలని కొందరు. మరి కొందరు.. లోకేష్ ఇదే విజయమ్మను గతంలో విజయ విజయ అంటూ గౌరవం లేకుండా మాట్లాడారనీ.. ఇప్పుడు విజయమ్మ అంటూ ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడమేంటని గత ట్వీట్లు కూడా తిరగదోడి మరీ కామెంట్లు చేశారు.

ఫైనల్ గా రంగంలోకి దిగారు లక్ష్మీపార్వతి. విజయమ్మకు శుభాకాంక్షలు చెప్పే స్థాయి నీకుందా? అని లోకేష్‌ని  అడుగుతూ.. చాలానే మాటలు మాట్లాడారు. మొన్న మీరు గెలిచింది ఒక గెలుపే కాదు. అన్నీ అడ్డదారులంటూ అవాకులు చెవాకులు మాట్లాడిన లక్ష్మీ పార్వతి చివరాఖర్లో ఒక బాంబు పేల్చారు. మీ అమ్మమ్మను నేను ఉన్నాను. నాకు ఎప్పుడైనా విషెస్ చెప్పావా? అంటూ నిలదీశారామె.

ఏమాటకామాట లోకేష్ విజయమ్మకు పుట్టిన రోజుల శుభాకాంక్షలు చెప్పడంలో ఒక రాజకీయ కోణం ఉన్న మాట నిజమే. ఆమె తన కొడుకు జగన్‌తో  గొడవలేం ఖర్మ ఏకంగా కోర్టు కేసుల్లో ఉన్నారు. తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాల్సిన జగన్ కాస్తా ఆ రోజు.. ముక్కు సర్జరీ చేయించుకున్న  పవన్‌పై  పడ్డారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ ఒక ట్వీట్ చేశారు. 2024 వరకూ తల్లి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ వచ్చిన జగన్ గత రెండేళ్లుగా అమ్మను మరచి పోయారు. ఈ విషయం గుర్తు చేస్తూ లోకేష్ విజయమ్మ ను కూడా తన అమ్మగా భావించి.. విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. 

ఏ మాటకామాట జగన్ కి పవన్ కి పెద్దగా పడేది కాదు. గత కొన్నాళ్లుగా ఆయన్ను జగన్ దత్తపుత్రుడు, మూడు పెళ్లిళ్ల వాడంటూ మాట్లాడేవారు. అలాంటి పవన్ మీద ఎక్కడా లేని ప్రేమ పుట్టుకొచ్చిన జగన్ తన తల్లిని కూడా మరచి ఆయన వెంటనే కోలుకోవాలంటూ.. ట్వీట్ చేయడం చాలా మందికి షాకింగా అనిపించింది. గతంలో వైసీపీ జనసేనతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నించింది అనే మాట కూడా చెలామణిలో ఉంది. ఈ విషయం మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్న మాట నిజం. అయితే ఇదంతా జగన్ కి ఏమంత ఇష్టం లేదు. అంతా కేంద్ర బీజేపీ నాయకత్వం చేసిన యత్నంగా చెబుతారు కొందరు వైసీపీ మద్దతుదారులు. అంత ఇష్టం లేని వ్యక్తి తల్లికన్నా ఎక్కువ ఎలా అవుతారన్నది ఇక్కడ అసలు టర్నింగ్ పాయింట్

ఈ పాయింట్‌ని  ఇన్ డైరెక్టుగా హైలెట్ చేస్తూ జగన్ సోదరి షర్మిళ సైతం ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఇప్పటికే ఆమె జగన్ కేంద్రానికి దత్తపుత్రుడిగా మారిపోయారంటూ చేసిన కామెంట్లను అలా ఉంచితే.. తన తల్లి తనకు ఎంతో అండగా ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. ఇదే అంశాన్ని లోకేష్ సైతం టచ్ చేస్తూ విజయమ్మకు శుభాకాంక్షలు చెప్పడం జగన్ని బాగా ఇరుకున పెట్టిన అంశంగా మారింది. దీన్నుంచి టాపిక్ డైవర్షన్ చేసే బాధ్యతలను ఆ ఇంటికి కాస్త రిలేషన్  గల లక్ష్మీపార్వతిని రంగంలోకి దించారు వైసీపీ వ్యూహకర్తలు. కట్ చేస్తే ఆమె తనకున్న వేలువిడిచిన అమ్మమ్మ బంధుత్వాన్ని బయటకు లాగి.. ఇదిగో ఇలా అమ్మమ్మ అనే రిలేషన్ ని గుర్తు చేసి తద్వారా.. లోకేష్ ని ఇరుకున పెట్టాలన్న యత్నం చేశారని అంటారు కొందరు విశ్లేషకులు.