ముందుకెళ్తే రాజీనామాలే: లగడపాటి

 

lagadapati telangana, telangana congress, lagadapati seemandhra, seemandhra antony committee

 

 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం ముందడుగు వేసినా రాజీనామాలకు వెనుకాడేది లేదు. ఏడుగురు సీమాంధ్ర ఎంపీలం రాజీనామాలు ఆమోదించుకుంటాం. కేంద్రమంత్రులు కూడా కొందరు రాజీనామాలకు సిద్దంగా ఉన్నారు అని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. సమైక్య ఉద్యమం నేపథ్యంలో సమైక్య వాదులు తమను రాజీనామాలు కోరడంలో అర్ధం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.


ప్రతిపక్షానికి చెందిన ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేస్తే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదని, సీమాంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే శాసనసభలో తెలంగాణ తీర్మానం ఓడించడం కష్టంగా ఉంటుందని, తెలంగాణ మీద కేంద్ర కేబినెట్ నోట్ వస్తే ఏం చేయాలి అన్న విషయం మీద సమాలోచనలు చేసేందుకు సమావేశం నిర్వహించనున్నట్లు లగడపాటి తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర విభజనకు అంగీకరించమని అన్నారు.