జనసేనలో జోష్ నింపిన లగడపాటి సర్వే

 

తెలుగు రాష్ట్రాల్లో లగడపాటి సర్వేకి మంచి పేరుంది. ఆయన్ను ఆంధ్రా ఆక్టోపస్ అని కూడా అంటారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆయన అంచనాలు తప్పి విమర్శలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఆయన సర్వే కోసం ఇప్పుడు ఏపీలో చాలా మంది ఎదురుచూస్తున్నారు. కానీ, లగడపాటి సర్వే రావడానికి ఇంకా టైముంది. అయితే లగడపాటి సర్వే టీం అంచనా ప్రకారం.. ఏపీలో జనసేన అందరూ ఊహించిన దానికంటే ఎక్కువ ప్రభావం చూపబోతుందని తెలుస్తోంది.

కిషోర్ అనే ఓ జనసేన కార్యకర్త లగడపాటి సర్వే టీంలోని ఓ వ్యక్తికి కాల్ చేసి.. ఈ ఎన్నికల్లో జనసేన ప్రభావం ఎలా ఉంటుందని అడిగి తెలుసుకున్నాడు. ఈ ఫోన్ కాల్ లీక్ అయ్యి.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ కాల్ లో లగడపాటి సర్వే టీంలోని వ్యక్తి మాట్లాడుతూ.. టీడీపీ, వైసీపీ పార్టీలు ఏపీలో జనసేన ప్రభావం అంతగా ఉండదని భావిస్తున్నాయి. కానీ జనసేన మంచి ప్రభావం చూపనుంది అన్నాడు. అందరూ అనుకుంటున్నట్లు జనసేనకి 5, 6 ఎమ్మెల్యే సీట్లు కాదు.. 14 నుంచి 22 ఎమ్మెల్యే సీట్లు గెలిచే అవకాశముందని అంచనా వేసాడు. అంతేకాదు జనసేన 3 ఎంపీ సీట్లు గెలిచే అవకాశం కూడా ఉందని తెలిపారు. విశాఖతో పాటు.. రాజమండ్రి మరియు నర్సాపురం ఎంపీ సీట్లు గెలుచుకోవడానికి జనసేనకు 80 శాతం అవకాశం ఉందని చెప్పాడు. మొత్తానికి ఆ లీకైన ఫోన్ కాల్ విని జనసైనికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.