రెండో పెళ్లి గొడ‌వ నుంచి ల‌గ‌పాటికి ఊర‌ట‌

 

కాంగ్రెస్ ఎంపి ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌కు సుప్రిం కోర్టు ఊర‌ట నిచ్చింది. రాజ‌గోపాల్ రెండో పెళ్లికి సంభందించిన పిటిష‌న్‌ను ఎలాంటి ఆదారాలు లేని కార‌ణంగా సుప్రిం కోర్టు కొట్టేసింది. 2004లో ఎన్నిక‌ల అపిడ‌విట్‌లో త‌న‌కు ఇద్దరు కుమారుల‌న్నట్టుగా తెల‌పిన ల‌గ‌డ‌పాటి త‌రువాత 2009లో మాత్రం త‌న‌కు ముగ్గురు కుమారుల‌ని మూడో కుమారుడి పేరు ఎల్ హ‌ర్మన్ అని పేర్కొన్నారు. దీంతో ల‌గ‌డపాటి రెండో పెళ్లి ఉదంతం తెర మీద‌కు వ‌చ్చింది.

దీంతో ల‌గ‌డ‌పాటికి రెండో పెళ్లి జ‌రిగింద‌ని వారికి కుమారుడు కూడా జ‌న్మించాడ‌ని మైల‌వ‌రానికి చెందిన అడ్వకేట్ సుంక‌ర కృష్ణమూర్తి గతంలో రాష్ట్ర ఎన్నికల అధికారి కూడా ఫిర్యాదు చేశారు. ల‌గ‌డ‌పాటి జానకి అనే యువ‌తిని రాజ‌గోపాల్ రెండో వివాహం చేసుకున్నార‌న్న లాయ‌ర్ వారి కుమారుడే హ‌ర్మోన్ అని పేర్కొన్నారు. రాజ‌గోపాల్, జాన‌కి దండ‌లు మార్చుకున్న ఫోటోను కూడా ఆయ‌న స‌మ‌ర్పించారు. అయితే ఈ సాక్షాలేవి చెల్లవ‌న్న కోర్టు స‌రైన సాక్షాలు లేని కార‌ణం కేసు కొట్టివేసింది.