TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

లడ్డూ తయారీపై సమగ్ర నివేదికకు ఆదేశం!

Published on: Fri Sep 20, 2024 6:19PM

లడ్డూ తయారీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోను ఆదేశించారు.   శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు అవశేషాలపై  రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది.  తిరుమలలో జరిగిన ఈ అపచారంపై  చంద్రబాబు  ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.ఏ  తిరుమల పవిత్రత కాపాడే విషయంలో ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్లతో చర్చించి చర్యలు తీసుకుంటామని సీఎం ప్రకటించారు. భక్తుల విశ్వాసాలు, ఆలయ సాంప్రదాయాలను కాపాడతామని చంద్రబాబు అన్నారు. ఈ తిరుమ‌ల ప‌విత్ర ను కాపాడే విష‌యంలో రాజీ ప‌డ‌బోమ‌ని తేల్చిచెప్పారు.