నారాయణపేటలో విషాదం.. 11 మంది మృతి

 

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేటలో విషాదం చోట చేసుకుంది. మరికల్‌ మండలం తీలేరులో మట్టిదిబ్బలు కూలి 11 మంది ఉపాధి కూలీలు మృతిచెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఉపాధి హామీ పనులు చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మట్టిదిబ్బల్లో మరికొందరు చిక్కుకున్నట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.