విశాఖకు క్యాంట్ ముప్పు...

సరిగ్గా రెండేళ్ల క్రితం హుధుధ్ తుఫాన్ సృష్టించిన విధ్వంసాన్ని మరచిపోకముందే విశాఖకు మరో తుఫాను ముప్పు ముంచుకొస్తోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. దీనికి అధికారులు క్యాంట్ అని నామకరణం చేశారు. ప్రస్తుతం విశాఖకు 685 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన క్యాంట్ వేగంగా తీరం వైపు దూసుకొస్తోంది. దీని ప్రభావంతో రేపటి నుంచి ఏపీలో, ఎల్లుండి నుంచి తెలంగాణలో భారీ వర్సాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన రాష్ఠ్ర ప్రభుత్వం అన్ని ప్రధాన ఓడరేవుల్లో హెచ్చరికలు జారీ చేసింది.