కర్నూలులో టీడీపీ నేత దారుణ హత్య

 

ఫలితాలకు ఒక్క రోజు ముందు కర్నూలు జిల్లాలో ఘోరం జరిగింది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి కుటుంబాలకు సన్నిహితంగా ఉండే శేఖర్ రెడ్డి అనే టీడీపీ మద్దతుదారుడిని దుండగులు దారుణంగా హత్య చేశారు. డోన్ మండలం, తాపల కొత్తూరులో శేఖర్ రెడ్డి టీవీఎస్‌పై వెళ్తుండగా.. ప్రత్యర్థులు దారిలో అడ్డగించి మొదట కర్రలతో దాడి చేశారు. అనంతరం బండరాయితో శేఖర్ రెడ్డి తలపై బలంగా కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఎన్నికల ఫలితాలు వచ్చే ఒక రోజు ముందు ఈ హత్య జరగడంతో కర్నూలులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ హత్య రాజకీయ కోణంలో జరిగిందా? లేక వ్యక్తిగత కారణాలతో జరిగిందా? అనేది తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హంతకుల్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక టీమ్‌లను దింపారు.