కర్ణాటకలో ఓడిన కుమారస్వామి సంకీర్ణ సర్కారు..

 

 

ఎట్టకేలకు కర్ణాటక అసెంబ్లీ లో బల పరీక్ష జరిగింది. ఈ బలపరీక్షలో కుమారస్వామి నాయకత్వంలోని సంకీర్ణ  ప్రభుత్వం  ఓటమి పాలయ్యింది. కుమారస్వామి  ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 105 ఓట్లు పడగా అనుకూలంగా 99 ఓట్లు మాత్రమే పడ్డాయి. దీనితో ప్రస్తుత జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం  పతనమైంది. త్వరలో బీజేపీ నాయకత్వం లో ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది. చూద్దాం బొటాబొటి మెజారిటీ తో ఆ ప్రభుత్వం ఎంత కాలం నిలుస్తుందో..