బిర్లాలకు అంటిన బొగ్గుమసి

 

సాక్ష్యాత్తు దేశ ప్రదానమంత్రినే దోషిగా నిలబెట్టిన బొగ్గు కుభంకోణం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు స్రుష్టిస్తూనే ఉంది.. ఇప్పటికే ఈ కేసులో పలు చార్జీషీట్లను దాఖలు చేసిన సిబిఐ తాజాగా మరో చార్జీషీట్‌ను దాఖలు చేసింది. మంగళ వారం దాఖలు చేసిన చార్జీషీట్లో బొగ్గు శాఖ కార్యదర్శి పిసి పరేఖ్‌, బిర్లా గ్రూప్‌కు చెందిన కుమార్‌ మంగళం బిర్లా పేర్లను చార్జీషీట్లో చేర్చారు.

 

ఇప్పటికే ఈ కేసుకు సంభందించి హైదరాబాద్‌తో పాటు కొలకత్తా, ముంబైలలో కూడా సిబిఐ తనిఖీలు చేస్తుంది. ఇప్పటికే చాలా మంది పెద్దలతో ముడి పడి ఉన్న బొగ్గు కుంభకోణంలో ఇప్పుడు తాజాగా బిర్లాల పేరు కూడా వినిపిస్తుండటంతో కేసు పై అంతర్జాతీయంగా చర్చ తీవ్రమయింది.