కుల్‌భూష‌ణ్ జాద‌వ్‌ని క‌ల‌వ‌నున్న త‌ల్లి, భార్య‌

 

గూఢచర్యం ఆరోపణలతో కుల్ భూషణ్ జాదవ్ ప్రస్తుతం పాకిస్థాన్ జైల్లో ఉన్నసంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం జైల్లో ఉన్న కుల్ భూషణ్ జాదవ్ ను కలిసేందుకు ఆయన తల్లికి, భార్యకు పాకిస్థాన్ అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ విదేశాంగ కార్యాల‌యం వెల్ల‌డించింది. డిసెంబ‌ర్ 25న భార‌త ప్ర‌తినిధి వార‌ధిగా వారిద్ద‌రూ కుల్‌భూష‌ణ్ జాద‌వ్‌ను క‌లిసేందుకు అంగీక‌రించింది. కాగా గ‌త మే నెల‌లో భార‌త్ వేసిన కేసు మేర‌కు కుల్‌భూష‌ణ్ జాద‌వ్ ఉరిశిక్ష‌ను తాత్కాలికంగా నిలిపివేయాల‌ని అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానం ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. అలాగే న‌వంబ‌ర్‌లో అత‌ని భార్య‌ను క‌లిసేందుకు పాకిస్థాన్ అంగీక‌రించింది. అయితే మాన‌వ‌తా దృక్పథంతో ఆలోచించి అత‌ని త‌ల్లికి కూడా జాద‌వ్‌ను క‌లిసేందుకు అనుమ‌తివ్వాల‌ని భార‌త విదేశాంగ శాఖ ఒత్తిడి తీసుకువ‌చ్చింది. ఈ విష‌యం గురించి భార‌త విదేశాంగ మంత్రి సుష్మ స్వ‌రాజ్, పాకిస్థాన్ హై క‌మిష‌న‌ర్‌తో ఇటీవ‌ల చ‌ర్చించారు. దీంతో పాకిస్థాన్ ఇందుకు అంగీకరించింది...