TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీఆర్ఎస్@ 25 ఇయర్స్.. తెలంగాణ భవన్ లో పార్టీ జెండా ఆవిష్కరించిన కేటీఆర్

Published on: Mon Apr 27, 2026 1:03PM

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నాయి. జిల్లా పార్టీ కార్యాలయాల్లో పార్టీ జెండాలను ఎగురవేశారు. కాగా.. తెలంగాణ భవన్‌లో పార్టీ  ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ  నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు  పోరాటం చేసి  కేసీఆర్  తెలంగాణ సాధించారన్నారు.

 ఢిల్లీ మెడలు వంచిన పార్టీ బీఆర్ఎస్ అన్న ఆయన.. గత రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో   దుర్మార్గ, అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పారు. భారతదేశ చరిత్రలోనే పాతిక వసంతాల ప్రస్థానం పూర్తి చేసుకున్న పార్టీలు కొన్ని మాత్రమే ఉన్నాయనీ, వాటిలో ఒకటి బీఆర్ఎస్ అన్నారు. 

పోరాడి సాధించుకున్న తెలంగాణను  కాపాడుకునేందుకు బీఆర్ఎస్  పునరంకితం అవుతుందనీ, అరాచక కాంగ్రెస్ , బీజేపీ పాలన నుండి తెలంగాణను మళ్లీ పట్టాలు ఎక్కించడం కోసం పోరాడుదామనీ పిలుపునిచ్చారు.  కేసీఆర్ సైనికులుగా బలగంగా కలిసికట్టుగా కదం తొక్కుతాదామన్నారు.  తెలంగాణ భవన్ కు కేసీఆర్ వస్తారని, నేతలకు దిశనిర్దేశం చేస్తారని కేటీఆర్ తెలిపారు. కవిత పార్టీ, ఆమె చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు మాత్రం కేటీఆర్ ఇష్టపడలేదు.