నేను బిజీ అందుకే మిస్సయ్యా - కేటీఆర్

మంత్రి కేటీఆర్,ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. రాజకీయ,సామాజిక అంశాలపై కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తుంటారు.శుక్రవారం నాడు లోక్ సభలో ఎన్డీఏ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగిన పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఎన్డీఏ సర్కార్ పాలనపై రాహుల్ గాంధీ ఇచ్చిన సీరియస్ స్పీచ్, స్పీచ్ అనంతరం ప్రధాని మోదీకి హగ్ ఇవ్వటం,సభలో కన్ను కొట్టటం వైరల్ అయిన సంగతి తెలిసిందే.అయితే ఇంత సీరియస్ డిస్కషన్ తో పాటు కొన్ని ఫన్నీ మూమెంట్స్ ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మిస్సయ్యారట.

 

 

తన కార్యక్రమాలలో బిజీగా ఉన్న కేటీఆర్..పార్లమెంట్ లో చర్చను చూడలేకపోయారట. అందుకే నిన్నటి పార్లమెంట్ చర్చపై కేటీఆర్ ఈరోజు స్పందించారు.‘నేను మేజర్ డ్రామా లైవ్ ను చూడటం మిస్సయినట్లుంది. కౌగిలింతలు,కన్ను కొట్టడాలు,వాక్చాతుర్యాలు ఎట్ సెట్రా’ అని కేటీఆర్ ఫన్నీగా  స్మైలింగ్ ఎమోజీతో ట్వీట్ చేశారు. దాంతోపాటు అవిశ్వాస తీర్మానం సందర్భంగా లోక్ సభలో టీఆర్ఎస్ తరపున మాట్లాడిన ఎంపీ వినోద్ ను కేటీఆర్ అభినందించారు. ‘కరీంనగర్ ఎంపీ వినోద్ గారికి నా అభినందనలు.. తెలంగాణ ప్రజలకు కేంద్రం చేసిన అన్యాయం,నెరవేర్చని హామీలను బాగా హైలెట్ చేశారు. వెల్ డన్ సర్’అంటూ వినోద్ పై ప్రశంసలు కురిపిస్తూ మరో ట్వీట్ చేశారు.