ఆయనకు మాస్క్ ఇస్తే జేబులో పెట్టుకున్నారు.. ఇప్పుడు కరోనా వచ్చింది: కేటీఆర్ 

తెలంగాణాలో కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్న నేపధ్యంలో అటు పోలీసులు, ఇటు వైద్య సిబ్బంది దీని బారిన పడుతున్నారు. వీరితో పాటు రాష్ట్ర హోమ్ మంత్రి మహమూద్ అలీ, మరో ముగ్గురు టీఆరెస్ ఎమ్మెల్యేలు కు వైరస్ సోకింది. తాజాగా డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఐతే ఇదే విషయమై మంత్రి కేటీఆర్ కరీంనగర్ లో ఒక కార్యక్రమం లో పాల్గొంటూ ఒక ఆసక్తికర సంగతి చెప్పారు. ఈ మధ్య జరిగిన ఒక కార్యక్రమంలో తాను ఉపసభాపతికి ఒక మాస్క్ ఇచ్చానని ఐతే అయన దానిని వాడకుండా జేబులో పెట్టుకున్నారని అన్నారు. అదేమని అడిగితె మేము హైదరాబాద్ వాళ్ళం గట్టిగా ఉంటాం అన్నారని తెలిపారు. ఇపుడు ఆయనకు కరోనా సోకిందని కేటీఆర్ చెప్పారు. మనం జాగ్రత్తలు పాటించడం మన కోసమే కాదు మన కుటుంబం కోసం కూడా అని ఈ సందర్భంగా అయన అన్నారు. కరోనా నుండి రక్షణ కోసం ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలని కేటీఆర్ ప్రజలకు సూచన చేసారు.