నాంపల్లి కోర్టులో కేటీఆర్
Published on: Fri Oct 18, 2024 11:09AM

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శుక్రవారం (అక్టోబర్ 18) నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. మంత్రి కొండా సురేఖపై ఆయన పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఆ దావాకు సంబంధించి కోర్టు ఆదేశాల మేరకు వాంగ్మూలం ఇచ్చేందుకు ఆయన నాంపల్లి కోర్టుకు వచ్చారు.
తెలంగాణ భవన్ నుంచి పార్టీ నేతలూ, కార్యకర్తలతో కలిసి కోర్టుకు చేరుకున్నారు. తనపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేటీఆర్ ఆమెపై వేసిన పరువునష్టం దావాపై నాంపల్లి కోర్టు శుక్రవారం (అక్టోబర్ 18)విచారించనుంది. కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన తరువాత కేటీఆర్ సాయంత్రం తెలంగాణ భవన్లో మూసీ సుందరీకరణపై రేవంత్ వ్యాఖ్యలు సవాళ్లపై మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.


