కృష్ణా జలాల పంపిణీపై తుది తీర్పు

 

కృష్ణా జలాల పంపిణీకి సంభందించిన కేసుపై నేడు తీర్పు వెలువడనుంది. పదేళ్లుగా మూడు రాష్ట్రాల వాదనలు వింటున్న బ్రజేశ్‌కుమార్‌ కమిటీ ఈ రోజు తుది తీర్పును వెలువడించనుంది. మన రాష్ట్ర అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా తీర్పు వెలువడితే మాత్రం రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పులో మన రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా అనేక అంశాలు ఉన్నాయి.శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు ట్రిబ్యునల్ ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమై తీర్పును వెల్లడించనుంది. ఇప్పటికే రాష్ట్రం తరఫున నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, అంతరాష్ట్ర జల వనరుల విభాగం సీఈ రవూఫ్ తదితర అధికారులు డిల్లీ చేరుకున్నారు.