నందిగామ బరిలో టీడీపీ అభ్యర్థి సౌమ్య

 

కృష్ణాజిల్లా నందిగామ టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు మరణంతో ఆ స్థానానికి ఖాళీ ఏర్పడింది. అయితే ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఓడిపోతామని తెలిసినప్పటికీ పోటీలో నిలవాలని జగన్ పార్టీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 20 నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ స్థానంలో అభ్యర్థిని నిలపాలని జగన్ భవించడం సరైన పని కాదని కృష్ణజిల్లా వైసీపీ వర్గాలే భావిస్తున్నాయి. ఖాయంగా ఓడిపోయే చోట నుంచి పోటీ చేసి పరువు పోగొట్టుకునే బదులు పోటీ పెట్టకుండా గౌరవాన్ని నిలుపుకోవడం మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.