ఓడిపోతామని తెలిసినా నందిగామలో జగన్ పార్టీ పోటీ...

 

కృష్ణాజిల్లా నందిగామ టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు మరణంతో ఆ స్థానానికి ఖాళీ ఏర్పడింది. ఈ స్థానం నుంచి తంగిరాల కుటుంబ సభ్యులే పోటీ చేసే అవకాశం వుంది అక్కడ తంగిరాల కుటుంబానికి చెందిన వ్యక్తే గెలిచే అవకాశం వుంది. కారణం, ప్రజల్లో తంగిరాలకు ఉన్న మంచి పేరు. అయితే ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఓడిపోతామని తెలిసినప్పటికీ పోటీలో నిలవాలని జగన్ పార్టీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 20 నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కాగా, నందిగామ ఉప ఎన్నిక నేపథ్యంలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పోటాపోటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. నందిగామ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో అక్కడ రాజకీయ సందడి నెలకొంది.