అయ్యన్న పాత్రుడుతో వైకాపా గీత భేటి

గత కొంత కాలంగా జగన్ తో విభేదిస్తున్న విశాఖ జిల్లా, అరకు వైకాపా ఎంపీ కొత్తపల్లి గీత ఆంధ్రప్రదేశ్ మంత్రి అయ్యన్న పాత్రుడుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ సందర్భంగా మంత్రి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తమ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని అన్నారు. పాడేరు, అరుకు నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చలు జరిపినట్లు అయ్యన్న తెలిపారు. ఎంతో మంతి పార్టీని మారుతున్నారని ఈమె పార్టీ మారితో తప్పా? అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. ఆమె పార్టీలోకి వస్తే తప్పకుండా ఆహ్వానిస్తామని... కానీ అటువంటి చర్చ జరగలేదని అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు.