జనవరి 15న ఏం జరగబోతుంది...

 

మూవీ క్రిటిక్ కత్తి మహేశ్.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య గత కొద్దిరోజులుగా వార్ నడుస్తున్న సంగతి తెలిసింది కదా. అయితే ఆ వార్ కాస్త శృతి మించి రాగాన పడింది. పొలిటికల్ విమర్శల నుండి మొదలై.. అవికాస్త వ్యతిగత విషయాల వరకూ వెళ్లింది. కత్తి మహేశ్ పవన్ పై చేస్తున్న విమర్శల నేపథ్యంలో నటి పూనమ్ కౌర్ విమర్శలు గుప్పించడంతో ఈ వివాదం ముదిరి పాకాన పడింది. పూనమ్ కౌర్ కౌంటర్ కు కత్తి కూడా రివర్స్ కౌంటర్ ఇచ్చారు. అక్కడితో ఆగకుండా... ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి పూనమ్ కౌర్, పపన్ కళ్యాణ్ కు ఆరు ప్రశ్నలు సంధిస్తున్నాను... సమాధానం చెప్పాలి అని అన్నాడు. దీంతో ఈ వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది.

 

మరోవైపు ఈ వివాదంపై స్పందించిన రచయిత, నిర్మాత కోన వెంకట్ ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలకాలని ఆయన భావిస్తున్నట్టు ట్వీట్‌ చేశారు. ‘‘ మౌనం ఎప్పటికీ మోసం చేయదు. జనవరి 15వ తేదీ వరకు అంతా మౌనంగా ఉండండి. కత్తి మహేష్‌కి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి మీడియా ఛానెళ్లకు వెళ్లి చర్చల్లో పాల్గొనటం.. పవన్‌కు, ఆయన అభిమానులకు వ్యతిరేకంగా మాట్లాడటం లాంటివి చేయొద్దని కోరుతున్నా. అలా చేస్తే శాంతి చేకూర్చాలన్న ప్రయత్నం విఫలమవుతుంది’’ అని కోన వెంకట్‌ ట్వీట్‌ చేశారు. దీంతో ఈనెల 15న ఏం జరుగుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలాఉండగా... పవనే నేరుగా రంగంలోకి దిగుతారా? లేదా వెంకట్ ద్వారా ఏదైనా సందేశం పంపించనున్నారా? అసలు ఆ రోజున ఏం జరగబోతుందన్న ఆసక్తి నెలకొంది.