TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కొమురం భీం జిల్లాలో పులిదాడి: మహిళ మృతి

Published on: Fri Nov 29, 2024 12:23PM

కొమురం భీం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పులి దాడిలో మహిళ మృతి చెందింది. గత కొన్ని రోజులుగా  కాగజ్ నగర్ మండలం గన్నారం గ్రామంలో పులి దాడులు కొనసాగుతున్నాయి. దీంతో  అనేక పశువులు చనిపోయాయి. తాజాగా మహిళపై దాడి జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.  వ్యవసాయపనుల కోసం వెళుతున్న మహిళపై పులి దాడి చేసింది. మహిళ కేకలతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ఆమె చనిపోయింది.  మహరాష్ట్ర అడవుల నుంచి పులులు కొమురం భీం అడవుల్లోకి వస్తున్నాయనమరో వైపు నిర్మల్ జిల్లాలో పులి సంచారం స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది.